Wednesday, May 15, 2024
- Advertisement -

వైసీపీ మద్దతుగా యాంకర్ శ్యామల

- Advertisement -

ఏపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. ఓ వైపు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తుండగా మరోవైపు సినీ నటులు కూడా తోడయ్యారు. భీమిలి నుండి పోటీ చేస్తున్న శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు నటి, యాంకర్ శ్యామల.

ఈ సందర్భంగా 2019లో వైసీపీలో జాయిన్ కాగా మొదట ప్రచారం చేసింది శ్రీనివాసరావుకే అన్నారు. అప్పుడు మహిళలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశాను..అప్పుడు అవంతి శ్రీనివాస్‌ని గెలిపించారన్నారు. అన్న మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తూ.. మీరు ప్రయోజనం పొందితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నారు అని చెప్పారు.

ఓటు వేసేముందు ఒక్కసారి ఆలోచించండి… హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా? హామీలు ఇచ్చి వదిలేసే ప్రభుత్వానికి ఓటేస్తారా అన్నది మీ ఇష్టం అన్నారు. ఓటు వేసి తర్వాత 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నామన్నారు. ప్రజలు నాయకులు వచ్చారని కాకుండా కుటుంబ సభ్యులు వచ్చారని వైసీపీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -