Saturday, April 27, 2024
- Advertisement -

టీడీపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. 10 మంది అభ్యర్థుల జాబితాలో నలుగురు కొత్తవారికి సీట్లు దక్కగా సీనియర్లకు సీట్లు కేటాయించింది. విజయవాడ వెస్ట్ నుండి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి,ధర్మవరం నుండి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్లను బరిలో నిలిపింది బీజేపీ.

అదోని – పీవీ పార్థ సారధి,ధర్మవరం – సత్యకుమార్,ఎచ్చెర్ల – ఎన్. ఈశ్వర్ రావు,విశాఖ నార్త్ – విష్ణు కుమార్ రాజు,అరకు – పంగి రాజారావు,విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి,కైకలూరు – కామినేని శ్రీనివాస్ రావు,అనపర్తి – శివ కృష్ణం రాజు,బద్వేల్ – బొజ్జా రోషన్న,జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి ఉన్నారు.

టీడీపీకి కేటాయించిన రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. దీంతో బీజేపీకి కేటాయించిన రెండు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లనున్నాయి.

ఏపీలో మొత్తం 175 స్థానాలకు కూటమి 167 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ – జనసేన – బీజేపీ. టీడీపీ ఇంకా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా గంటా,కళా వెంకట్రావ్‌తో పాటు చాలా మంది సీనియర్లు సీట్లను ఆశీస్తున్నారు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -