Saturday, April 27, 2024
- Advertisement -

బ్రాహ్మణి తప్పుకుందా…తప్పించారా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెరపైకి వచ్చారు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి. బాబుతో పలు ములాఖత్‌లలో భేటీ కూడా అయ్యారు. ఇక ప్రధానంగా బ్రాహ్మణి రాజమండ్రి క్యాంపు కార్యాలయం వద్ద నుండే టీడీపీ నేతలకు దిశా నిర్దేశం కూడా చేశారు. అంతేగాదు ప్రతి శనివారం టీడీపీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల పిలుపుతో పాటు ఆమె స్వయంగా నేతలతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రతీ కార్యక్రమంలో అత్త భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఇక తర్వలోనే వీరిద్దరూ కలిసి బస్సుయాత్ర చేయడం ఖాయమని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు తెరపై కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. ఒకరు లోకేష్ మరొకరు భువనేశ్వరి. మొన్నటి వరకు అన్ని తానై చూసుకున్న నారా బ్రాహ్మణి సడన్‌గా సైలెంట్ కావడం టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ప్లాన్ బీలో భాగంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. లోకేష్ సైతం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి తల్లి భువనేశ్వరితో కలిసి బస్సుయాత్రలో పాల్గొననున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబు సతీమణిని బస్సుయాత్రకు లీడర్‌ను చేయడం వెనుక అంతర్యం ఏంటో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక జరుగుతున్న పరిణామాలతో బ్రాహ్మణి సైతం అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం.

అయితే టీడీపీ నేతలు మాత్రం బాబు అరెస్టు ఎపిసోడ్ లో బ్రాహ్మణి, భువనేశ్వరి మాటల్ని చూసినోళ్లు.. భువనేశ్వరి మాటలకే కనెక్టు అయినట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ కూతురిగి ప్రొజెక్ట్ చేస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. అందుకే బ్రాహ్మణిని తప్పించి భువనేశ్వరికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా చేస్తున్నారట. మరి టీడీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -