టీడీపీ నేత నారా లోకేష్ హస్తిన టూర్ ఫ్లాపైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్పై బీజేపీ పెద్దలను కలిసేందుకు అదేవిధంగా పలు జాతీయ పార్టీల మద్దతు కూడ గట్టేందుకు లోకేష్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ రాత్రి మంగళగిరి చేరుకోనున్నారు లోకేష్.
వాస్తవానికి ఎన్నో ఆశలతో హస్తినకు చేరుకున్నారు లోకేష్. ప్రతీరోజు బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు కానీ అది వర్కవుట్ కాలేదు. దీంతో నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. బాబు అరెస్ట్ అక్రమమని నిరూపించే ప్రయత్నం చేశారు కానీ మీడియా అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరయ్యారు.
అలాగే పలు మీడియా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు లోకేష్. సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 90 శాతం వాటాను వారు రిలీజ్ చేయకుండానే పది శాతం వాటాను ఎలా రిలీజ్ చేశారు అని అడిగిన ప్రశ్నకు లోకేష్ తడబడ్డారు. ఇక జాతీయ స్థాయి నేతల నుండి కూడా మద్దతు కరువైంది. అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం చివరివరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక తిరిగి ఏపీకి పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు లోకేష్.