Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ మెడకు చంద్రబాబు అక్రమాస్తుల వ్యవహారం!

- Advertisement -

టీడీపీ – జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పొత్తు ఖరారైన దగ్గరి నుండే వైసీపీ నేతలు పవన్‌ని ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్త పుత్రుడు అని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అంతేగాదు పవన్‌ని ఒకడుగు ముందుకేసి పావలాతో కూడా పోల్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో బాబు అక్రమాస్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి నిర్మాణం సందర్భంగా బోగస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చి అక్రమంగా డబ్బులు కూడబెట్టారని ఇందుకు సంబంధించిన నోటీసులను ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చింది. దీనిపై బాబు ఇచ్చిన వివరణను తోసిపుచ్చింది కూడా.

ఇక ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. మంత్రుల దగ్గరి నుండి చిన్న స్ధాయి నేతల వరకు అంతా టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో బాబుకు ఇచ్చిన నోటీసులపై జనసేన అధినేత పవన్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడిదే పవన్ మెడకు చుట్టుకుంది.

ఎందుకంటే చంద్రబాబుపై ఏ చిన్న కేసు నమోదైనా, ఎవరు విమర్శించినా టీడీపీ నేతల కంటే ముందు స్పందించేది పవన్ కల్యాణే. గతంలో చంద్రబాబుపై ఈగ వాలినా తట్టుకోని పవన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో చెప్పాలని టీడీపీ నేతలే డిమాండ్ చేస్తుండటం విశేషం. ఇక వైసీపీ నేతలు సైతం జనసేనను ఇబ్బందిపెట్టేలా చంద్రబాబు దత్తపుత్రుడు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే నోటీసులు వైసీపీ నేతలకే వచ్చుంటే ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఇలానే సైలెంట్‌గా ఉండేవారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒక అడుగు ముందుకేసి చంద్ర‌బాబునాయుడు దోచుకున్న అక్రమ సంపాదనలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా వాటా ఉందని ఆరోపిస్తున్నారు. మరి దీనిపై పవన్‌తో పాటు జనసైనికులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -