Sunday, May 19, 2024
- Advertisement -

క్లారిటీ..వైసీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నా బస్సుయాత్రతో ఎన్నికల శంఖారావన్ని పూరించారు సీఎం జగన్. ఇక బస్సుయాత్ర విజయవంతంగా సాగుతుండగా తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం వైసీపీ ప్రభుత్వంపై లక్ష్మీనారాయణ ప్రశంసలు గుప్పించడమే కారణం.

ఇక ఈ వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారగా ట్విట్టర్ ద్వారా వెంటనే స్పందించారు జేడీ. వైసీపీలో చేరుతున్నానే ఊహాగానాలలో ఏ మాత్రం వాస్తవం లేదని ….ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించగా ఆయన్ని కలిశానని తెలిపారు. ఈ సందర్భంలోనే వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని చెప్పుకొచ్చారు. అంతమాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు.

శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతుండగా అందులో పాల్గొన్న జేడీ .. జగన్ పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారనే పుకార్లు షికార్ చేయగా వెంటనే స్పందించి ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు జేడీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -