- Advertisement -

కవిత ఎపిసోడ్..ఓ రాజకీయ డ్రామా!

- Advertisement -

కవిత ఎపిసోడ్ ఓ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అని మండిపడ్డారు తెలంగాణ మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్….. తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా? … నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేడా? , కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం అవినీతి బయట పడేసరికి ఈ గొడవలను తెరమీదకు తెచ్చారు అన్నారు.

అవినీతి సొమ్ము, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడాలతోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారు… సంతోష్ రావు బినామీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ. పందల కోట్లు సంపాదించారని కవిత ఆరోపించింది… ములుగులో నన్ను ఓడించేందుకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వందల కోట్లు ఖర్చు చేశాడు అన్నారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిది కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా? చెప్పాలన్నారు.

కేటీఆర్ ను కవిత వెనకేసుకురావడం పెద్ద డ్రామా… మొదట కేటీఆర్ ను టార్గెట్ చేసి ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేశారు, కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే భవిష్యత్తులో అందరూ కలిసి పోతారు అన్నారు. కవితను విమర్శించిన మహిళా నేతలే నష్టపోతారు అన్నారు సీతక్క.

కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికే కవిత ఇష్యూని తెర మీదకు తెచ్చారు అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. టీవీ వాళ్లకు దండం పెడతా కవిత, బీఆర్ఎస్ లపై ఇకనైనా బ్రేకింగ్లు ఆపేయండి … ఆమె రాజీనామా చేస్తే ఏంది? చేయకపోతే ఏంది? ,వాళ్ల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ,కాంగ్రెస్ వాళ్లతో కుమ్మక్కై బీఆర్ఎస్ వాళ్లు ఈ డ్రామాలు చేస్తున్నారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -