Sunday, April 28, 2024
- Advertisement -

ఖమ్మం ఫైట్…బీజేపీలోకి నామా?

- Advertisement -

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలో చేరగా తాజాగా మరో ఎంపీ బీఆర్ఎస్‌కు షాకిచ్చేందుకు రెడీ అయ్యారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరనున్నారు. ఇక పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఇప్పటివరకు ఖండించలేదు.

ఇక బీజేపీ ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే జలగం వెంకట్రావ్ బీజేపీలో చేరగా ఇప్పుడు నామా చేరుతున్నారనే వార్తలతో ఖమ్మం ఫైట్ ఆసక్తికరంగా మారింది.

వరంగల్ టికెట్ ఆరూరి రమేశ్ కు దాదాపుగా ఖరారు కాగా నామా బీజేపీలో చేరితే ఆయనకు సీటు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం సీటును టీడీపీకి ఇస్తారని ప్రచారం జరుగుతున్న దానిని బీజేపీ నేతలు ఖండించారు. ఇక టీటీడీపీ నేతలు సైతం పోటీకి సిద్ధం లేరు. మొత్తంగా నామా పార్టీ మారుతున్నారన్న వార్తలు మాత్రం ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -