జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు షాక్ తగిలింది. వారాహి యాత్ర సభలో తనపై రాళ్ల దాడి జరుగుతుందని పవన్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు.పవన్ చేసిన ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే చూపించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామని ఆ ప్రాంతాన్ని పరిశీలించామని…ఈ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా..? ఉంటే తమ దృషికి తీసుకురావలని తెలియజేస్తూ నోటీసు ఇచ్చామని వెల్లడించారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటామని వెల్లడించారు.
పవన్ పై దాడి జరుగుతుందని ఆయనకు ఎలా తెలిసింది..? ఎటువంటి సమాచారంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసారో తెలిపాలని కోరామని…అయితే ఈ నోటీసులకు పవన్ నుండి రిప్లై రాలేదన్నారు. నోటీసులకు రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాల్సి వస్తుందని పోలీసులు వెల్లడించారు.పవన్ చేసిన వ్యాఖ్యలతో నాలుగు రోజులుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని…రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలుగా వాడడం మానుకోవాలని సూచించారు.
అయితే వాస్తవానికి పవన్ రాళ్ల దాడిపై వ్యాఖ్యలు చేసినప్పుడే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అందరికి అర్ధమైంది. తాజాగా పోలీసుల ప్రాథమిక విచారణలో అదే తేలడంతో పవన్ డిఫెన్స్లో పడ్డారు.