Tuesday, April 30, 2024
- Advertisement -

లోకేశ్…‘సత్యమేవ జయతే’!

- Advertisement -

చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తోంది టీడీపీ. అయితే టీడీపీ చేస్తున్న ఆందోళనలకు అంత స్పందనరాలేదు. డప్పు చప్పుళ్లు, కంచాలను మోత, విజిల్స్ ఊదుతూ, వాహనాల హారన్ లతో మోతమోగించాలని పిలుపునిచ్చినా ఉపయోగం లేకపోయింది. దీనికితోడు అనుమతి లేకపోయినా కంచాలు మోగిస్తూ, విజిల్స్ వేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని 60 మందిపై కేసు నమోదుచేశారు.

ఇక తాజాగా నారా లోకేశ్ ఢిల్లీలో సత్యమేవ జయతే నిరాహార దీక్ష చేపట్టారు. మహాత్మాగాంధీ, ఎన్టీఆర్ కి నివాళులర్పించి నిరాహార దీక్ష చేపట్టారు. అవినీతి కేసుల్లో విచారణను డైవర్ట్ చేయడానికే లోకేష్ దీక్ష చేపట్టారని టాక్ నడుస్తోంది.

చంద్రబాబు సైతం జైల్లో నిరాహార దీక్ష చేయనున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఈ రాత్రి లైట్లు ఆర్పివేయాలని టీడీపీ నేతలు ప్రజలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ నేతలు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం నిరాహార దీక్ష చేపట్టారు. అయితే టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రెండు రోజుల్లో బాబు బెయిల్, క్వాష్‌ పిటిషన్‌, లోకేష్ సీఐడీ విచారణ జరగనుండటంతో ఏం జరుగుతుందోనని టీడీపీ నేతల్లో మాత్రం టెన్షన్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -