అటు చింతమనేని ఆరోపణలపై మంత్రి జోగి రమేశ్ ఘాటుగా స్పందించారు. హత్యా రాజకీయాలనే ప్రేరేపించేది టీడీపీయే అన్నారు. చింతమనేనివి అన్ని బూటకపు మాటలని ఆరోపించారు. హత్యా రాజకీయాల మీద బతికిన పార్టీ టీడీపీ అని విమర్శించారు.
అయితే చింతమనేని ప్రభాకర్ ను చంపేందుకు షూటర్ ను నియమించారనే ప్రచారం ఇప్పుడు గోదావరి జిల్లాల్లో సంచలనంగా మారింది. టీడీపీ కేడర్ లో ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 37 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులను హత్య చేశారని ఆరోపించారు. ఇవన్నీ కూడా ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం
మంత్రి కొప్పులు నా సీటు లాగేసుకున్నారు
కేఏ పాల్ నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు
-Ramesh Reddy Chilakala