- Advertisement -
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత అడ్లూరి లక్ష్మణ్కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు.
అయితే, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని లక్ష్మణ్ పేర్కొన్నారు. తన సీటును లాగేసుకున్నారన్నారు. ధర్మపురి అసెంబ్లీ ఓట్లను మళ్లీ లెక్కించాలన్నారు. కౌంటింగ్ కోసం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
వచ్చే నెల 3 లోగా న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నారు. తనకు ఏమైనా అయితే.. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
Also Read