- Advertisement -
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ కేఏపాల్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన భర్త వెంకటాచారిని మభ్యపెట్టి ఆయన పార్టీలో చేర్చుకున్నన్నారని ఆరోపించారు. తన కుటుంబంలో kA పాల్ చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజ్యసభ సీటు బీజేపీ నుంచి ఇప్పిస్తానని తనను కూడా 15 రోజులుగా ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. శంకరమ్మ 40 కోట్లు అడిగిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు శంకరమ్మ. తాను టీఆర్ఎస్లోనే ఉంటానని, ఏ పార్టీలోకి మారనని స్పష్టంచేశారు.
తమ కుటుంబంలో చిచ్చు పెడితే KA పాల్ కాళ్లు విరగ్గొడుతానని హెచ్చరించారు. 1000 మంది అమరవీరుల కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఇచ్చి, ఇల్లిస్తే కేఏ పాల్ పార్ లో చేరతానన్నారు శంకరమ్మ.
పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం