Monday, May 6, 2024
- Advertisement -

జనసేనలోకి ముద్రగడ!

- Advertisement -

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభవ జనసేనలో చేరనున్నారా?వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగిన చివరికి జనసేనలో చేరేందుకు ఎందుకు రెడీ అయినట్లు ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి పవన్‌ మద్దతు టీడీపీకి ఇవ్వడంతో కాపు సామాజికవర్గం టీడీపీకి ఓటు బ్యాంకుగా మారుతుందని భావించారు. కానీ ముద్రగడ వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగిన వెంటనే సర్వేలు చేయించారు టీడీపీ – జనసేన అధినేతలు.

అసలుకే మోసం వస్తుందని గ్రహించి, వెంటనే ముద్రగడ వద్దకు రాయబారాలు నడిపారు. తనకు వచ్చిన అవకాశం ముద్రగడ ఎందుకు వదులు కుంటారు. అసలైన ఉద్యమ నేత. అంతే, ఇప్పుడు పవన్ కు ఉచ్చు బిగిస్తున్నారు. ముద్రగడ పద్మనాభావంతో పవన్ దూతలు సమావేశమయ్యారు. జనసేనలో రావాలని ఆహ్వానించారు. కాపులంతా ఐక్యంగా ఉండాలంటూ పవన్ రాసిన లేఖను ప్రస్తావించారు.

ముద్రగడ పార్టీలో చేరటం పైన స్పష్టత ఇవ్వకపోయినా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఆ తర్వాత టీడీపీ జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగారు. టీడీపీలో చేరాలంటూ ముద్రగడను ఆహ్వానించారు. అయితే ముద్రగడ కుమారుడు తాము జనసేనలో చేరేందుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. కాకినాడ పార్లమెంట్ తో పాటుగా రెండు అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు చెప్పారు. ఇక త్వరలో ముద్రగడతో పవన్ సమావేశం అవుతారని తెలుస్తోంది. దీంతో పాటు పవన్ ముందు తన కోరికల చిట్టాను ఉంచనున్న ముద్రగడ అన్ని అనుకున్నట్లు జరిగితే జనసేనలో చేరడం దాదాపు ఖాయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -