త్వరలో జరిగే ఏపీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. టీడీపీతో బీజేపీని కలిపేందుకు పవన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ సింగిల్గా పోటీ చేయడం దాదాపు ఖరారైంది.
టీడీపీ – జనసేన కీలక నేతల సమాచారం ప్రకారం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం దాదాపు ఖరారైంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా జనసేనకు 30 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోండగా టీడీపీ 165,23 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుంది. దీనిపై ఈ రెండు, మూడు రోజుల్లో అఫిషియల్ అనౌన్స్మెంట్ చంద్రబాబు, పవన్ కలిసి ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో ఇప్పటివరకు టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందన్న వార్తలకు పుల్ స్టాప్ పడినట్లే. దీంతో బీజేపీ ఇప్పుడు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..?ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీ – జనసేనతో పొత్తుకే మొగ్గుచూపుతుండటంతో కొంతమంది నేతలు ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.