Friday, March 29, 2024
- Advertisement -

దిశ కేసులో కీలక విషయాలు.. మొబైల్ దొరికింది..!

- Advertisement -

హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ కేసు సాక్ష్యాల సేకరణకు శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో నలుగురు అదనపు ఎస్పీ స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్లు మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి ఈ కేసు కోసం వివిధ అంశాల్లో పని చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

దిశ హత్య జరిగిన సంఘటన స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వస్తువులను పోలీసులు వాటిని కోర్టుకు అందజేసినట్లు తెలుస్తోంది. దిశపై అత్యాచారం జరిగిన టోల్ గేట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దిశకు సంబంధించిన పర్సు, డెబిట్ కార్డు, చున్నీ, లాకెట్, ఐడీ కార్డు, లోదుస్తులు, జీన్ ఫ్యాంట్, చెప్పులను ఘటన జరిగిన మరుసటి రోజే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక దిశ ఫోన్ ను నిందితులు ఓ చోట పాతి పెట్టిన విషయంను గుర్తించారు. ఈ ఫోన్ ద్వారా దిశ మాట్లాడిన కాల్స్ తో పాటు ఆమె కాల్ రికార్డింగులు కూడా ఏమైన కేసుకు ఉపయోగపడుతాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇక నలుగురు నిందితుల విషయంకు వస్తే.. వారం రోజుల కస్టడీలో భాగంగా నిందితులను విచారించి వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయనున్నారు.

సీన్ టూ సీన్ మొత్తం వివరాలను నిందితుల నుంచి పోలీసులు రాబట్టనున్నారు. దిశపై హత్యాచారం చేసిన వెటనే ఎందుకు తగులబెట్టారు ? అనే విషయంలో ఈ సారి నిందితులు కొత్త విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తోంది.

ఆమె చివర్లో స్కూటీ పంక్చర్ వేయించేందుకు వెళ్లిన నిందితుడితో ఆరు నిమిషాలు ఏం మాట్లాడింది ? అనే దానిపై కూడా విచారణ చేస్తున్నారు. ఏది ఏమైన ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో.. నిందితులకు కఠిన శిక్ష పడేలా అధారాలు సేకరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -