తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని డే1 నుండి ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలే రేవంత్ను గద్దె దించేందుకు కుట్ర చేస్తున్నారని తెలుస్తోండగా దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్లే అనుకుంటున్నారని…. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలే వెళ్లి సీఎం రేవంత్ కు సహాయం చేసే అవకాశం ఉందని ఆడియో లీక్ అయింది.
ఇక తాను బీజేపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో తన మద్దతుదారులతో ఫోన్లో చెప్పారు సైదిరెడ్డి. ఢిల్లీ రావాలని బీజేపీ ముఖ్య నేతల నుంచి పిలుపు రావటంతో వెళ్లానని..అక్కడ బీజేపీ పెద్దలు కండువా కప్పుకోవాలని సూచించారని అందుకే బీజేపీలో చేరానని తెలిపారు. ఎంపీ టికెట్ వస్తుందని…వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని చెప్పారు. ఇక కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేని తన అనుచరులతో చెప్పారు సైదిరెడ్డి.
నన్ను అర్థం చేసుకుంటారని నేను అప్పటికప్పుడు బీజేపీలో చేరానని…చరిత్రలో ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న మోడీ లాంటి నాయకుడు లేరు అని తెలిపారు. బీజేపీ హయాంలో ఒక్క స్కాం కూడా లేదని..దేశమే ఆయన కుటుంబం అన్నారు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి వంటివారు పోటీ చేయడం లేదని చెప్పారు. పార్టీ మారినందుకు క్షమించాలని తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం సైదిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.