Friday, May 3, 2024
- Advertisement -

ఓటమిని ఒప్పుకున్న టీడీపీ!

- Advertisement -

రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్ని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. ఇక తాజాగా టీడీపీ నేతలే వైసీపీ విజయాన్ని ఒప్పుకున్నారు. వైసీపీ సీట్లు ప్రకటన దగ్గర నుండి ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది వైసీపీ. అలాగే సామాజిక బస్ యాత్ర, వై ఎపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన సిద్ధం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. వైసీపీ గెలుపు ఖాయమని తెలిపోయింది. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్ధమైంది. దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి అంతంతమాత్రంగా స్పందన రావడంతో క్యాడర్ లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది. టీడీపీ, జనసేన మద్య పొత్తు పొసగలేదు. సీట్లు సర్ధుబాట్లలో చిచ్చు చెలరేగింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లో సమన్వయం కొరవడింది. టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావుటా మొదలైంది.

సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు అవిరైపోయాయి. టీడీపీ, జనసేన మద్య సీట్ల షేరింగ్ లో చాలా చోట్ల విభేదాలు తలేత్తాయి. దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది. దీనికి తోడు 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది.

టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్.పార్టీ నేతలకు దిశానిద్దేశం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -