Saturday, May 18, 2024
- Advertisement -

నా భర్త పరువు తీస్తే.. వాళ్లను వదిలిపెట్టేది లేదు : లక్ష్మీ పార్వతి

- Advertisement -

లక్ష్మీస్ వీరగ్రంథం అనే టైటిల్ తో తన జీవిత చరిత్రను తెరకెక్కించి తన భర్త పరువు తీస్తే ఊరుకునేది లేదని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ ఓ సినిమాని తెరకెక్కిస్తారని తెలిపారు. లక్ష్మీ పార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని వదిలి సూట్ కేస్‌తో బయటకు రావడంతో సినిమా మొదలై, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించడంతో ఈ సినిమా ముగుస్తుందని చెబుతున్నారు.

నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. అయితే ఈ విషయంపై లక్ష్మీ పార్వతి స్పందించారు. తన పరువు కానీ.. తన భర్త పరువు కానీ పరువు తీయాలని చూస్తే సహించనని తెలిపింది. అయితే కొంత కాలంగా తనను రచ్చకీడ్చాలని భావిస్తున్న కొందరు, ఉన్నవి లేనివి కల్పించి సినిమాలు తీద్దామని భావిస్తున్నారని, వారి ప్రయత్నాన్ని తన ప్రాణం అడ్డుపెట్టయినా అడ్డుకుంటానన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర కూర్చుంటే… ఆ బాధల నుంచి కాస్త ఉపసమనం దొరుకుందని వచ్చాను. నా జీవిత చరిత్రపై లక్ష్మీ వీరగ్రంధం సినిమా తీయడం చట్టవిరుద్ధం. అనుమతి లేకుండా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

ఈ సినిమాకు నా అనుమతి తప్పనిసరి అంటున్నారు లక్ష్మీపార్వతి. ఇంకోవైపు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీ వీరగ్రంధం సినిమాని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు.. అన్ని అధారాలతో సినిమా ఉంటుందని అన్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అఫిషియల్ గా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -