టాలీవుడ్ చార్మింగ్ గాళ్ చార్మి ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతోందట. అప్పుడేప్పుడో ‘నీతోడు కావాలి’ అంటూ టాలీవుడ్కు పరిచయమైంది ఈ భామ. తన అందచందాలతో కుర్రకారును ఊపేసిన హీరోయిన్ ఛార్మి కౌర్. వెండితెరపై వెలిగినంత కాలం ఫ్యాన్స్ కు సొగసుల విందులు అందించింది. గత కొంత కాలంగా యాక్టింగ్ కి దూరంగా ఉంటూ.. నిర్మాణ రంగం వైపు మళ్లింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ వస్తోంది.
పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ స్థాపించిన వీరిద్దరూ.. ఇప్పటి వరకూ పలు చిత్రాలను నిర్మించారు. ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా వీళ్లిద్దరూ నిర్మించిందే. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్’ చిత్రం కూడా వీళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. తాజాగా తన సమీప బంధువును ఛార్మి పెళ్లాడబోతోందట. పెళ్లికి ఛార్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
మూడు పదుల వయసు దాటినా పెళ్లి చేసుకోవడానికి ఇన్నాళ్లూ ఛార్మి ఇష్టపడని సంగతి తెలిసిందే. అయితే పెళ్లికొడుకు గురించి ఎలాంటి వివరాలు తెలియజేయకున్నా… అతను తన సమీప బంధువు అని చెప్పింది.. అంతేకాదు త్వరలో అన్ని విషయాలు చెబుతానని అంటుంది హాట్ బ్యూటీ.
కడప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి
ఏపి సీఎం జగన్ ని తెగ మెచ్చుకుంటున్న నటుడు, మాజీ కేంద్ర మంత్రి!