Friday, April 26, 2024
- Advertisement -

క‌డ‌ప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి

- Advertisement -

ఏపీలో కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కలసపాడు మండలం, మామిళ్లపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడే పనుల్లో ఉన్న 10 మంది క్వారీ కూలీలు మృతి చెందగా.. మృత‌దేహాలు తునాతున‌క‌లయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.

జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది. ప్ర‌మాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏపి సీఎం జగన్ ని తెగ మెచ్చుకుంటున్న నటుడు, మాజీ కేంద్ర మంత్రి!

అజ్ఞాతం వీడింది.. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్!

అబ్దుల్లాపూర్ మెట్ లో రోడ్డు ప్రమాదం.. డిఐ దంపతులు మృతి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -