సినీ పరిశ్రమలో.. నటుల మధ్య విభేదాలు ఉండటం మాములే. ఆ విభేదాలకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే సీనియర్ నటుడు మోహన్ బాబు,కృష్ణం రాజు మధ్య కొంతకాలం క్రితం మొదలు అయిన విభేదాలు పెరిగే ప్రమాదం ఏర్పడిందని సినీ వర్గాలల్లో ప్రచారం జరుగుతోంది.
{loadmodule mod_custom,GA1}
మరి వీరి మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటో అనే విషయంపై పరిశోదన చేస్తే.. కృష్ణం రాజు నటించిన భక్తకన్నప్ప సినిమా అని తెలుస్తోంది. తన సొంత బ్యానర్ లో ‘భక్తకన్నప్ప’ సినిమా నిర్మించిన కృష్ణం రాజు ఈ సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేపించాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ కి ఈ మూవీలో నటించడం ఇష్టంలేదో లేక అతడు వరుస సినిమాలతో బిజీ గా ఉండడం వాళ్ళ ఈ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ని భక్త కన్నప్ప గా చూపిస్తూ ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణం రాజు ఈ సినిమా జోలికి వెళ్లొద్దని చెప్పేశాడట. ఈ విషయంలో మీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కృష్ణం రాజు కి మోహన్ బాబు ఖరాకండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
{loadmodule mod_custom,GA2}
అయితే ఈ మూవీ స్టార్ట్ చేస్తే.. మోహన్ బాబు పై కేసు వెయ్యాలని కృష్ణం రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ భక్త కన్నప్ప సినిమా విషయంలో మోహన్ బాబు,కృష్ణం రాజు మధ్య స్టార్ట్ అయిన గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.
{youtube}3XSvQBXudIE{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related