Sunday, May 5, 2024
- Advertisement -

అఖిల్ కి ప్రపోజల్.. నీహారికతో అలా చేశా..?

- Advertisement -

అక్కినేని అఖిల్ ఇప్పుడు తన కెరీరి మీద బాగా కాన్సన్ ట్రేషన్ పెట్టాడు. అఖిల్ మొదటి మూవీ ప్లాప్ కావడంతో.. ఇప్పుడు తన రెండో సినిమాతో ఎలా అయిన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తన రెండో సినిమాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ యంగ్ హీరోకి లైఫ్ లో జరిగిన సరదా సన్నివేశాన్ని వివరించాడు. ఈ మధ్య విమానంలో హైదరాబాద్ నుండి అబుదాబీ వెళుతున్న టైంలో తాను నిద్ర పోగా, లేచి చూసే సరికి సీటు ముందు ఉన్న టీవి స్క్రీన్ పై ఓ నోటు రాసి ఉందట. నువ్వు హాట్ గా ఉన్నావు సరేనా అంటూ నేను రెడీ అని అందులో రాసి ఉందన్నాడు.

అయితే కొద్ది సేపటికి నీకు లవ్ ప్రపోజల్ చేసింది అమ్మాయి కాదు, అబ్బాయి అని ఎయిర్ హోస్టెస్ చెప్పడంతో ఖంగుతిన్నాడట అఖిల్. ప్రపోజ్ చేసిన అబ్బాయి పక్కనే ఉండడంతో తాను కొంత భయపడినట్టు తెలిపాడు ఈ సిసింద్రీ. ఇక విమానం దిగగానే వేగంగా పరుగుతీసి తప్పించుకున్నట్లు చెప్పాడు. ఇక అఖిల్ నటించిన మొదటి సినిమాలో మెగా డాటర్ నీహారిక హీరోయిన్ గా నటిస్తోంది అన్న వార్త అప్పట్లో తెగ హల్ చేసింది. అయితే అఖిల్ మొదటి సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే నీహారిక హీరోయిన్ గా నటించబోతుంది అనే వార్త రావడానికి కారణమేంటొ చెప్పాడు అఖిల్. అప్పట్లో వీరిద్దరూ కలిసి ఓ షార్ట్ ఫిలింలో నటించారట.

అది కూడా చాలా పెద్ద టీంతో షూటింగ్ చేశారట. దాదాపు 120 మంది ఈ షార్ట్ ఫిలిం కోసం వర్క్ చేశారని చెప్పాడు అఖిల్. షార్ట్ ఫిలింని కూడా పెద్ద కాన్వాస్ పై చిత్రీకరించారని అన్నాడు అఖిల్. అంతే కాదు.. దీనికోసం బడ్జెట్ కూడా బాగానే కేటాయించారట. పైగా దీనికి దర్శకుడు ఎవరో తెలుసా.. దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ. భారీగా ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ జరగడంతో.. చాలా మంది తామిద్దరం కలిసి సినిమాలో నటించినట్లుగా పొరపడ్డారని అన్నాడు అఖిల్. అయితే ఈ షార్ట్ ఫిలిం కూడా విడుదల కాలేదు. ఔట్ పుట్ సరిగా రాకాపోవడంతో ఈ షార్ట్ ఫిలింను రిలీజ్ చేయలేదని అన్నారు. సో మొత్తాని అఖిల్ తన మొదటి మూవీ టైంలో వచ్చిన రూమర్స్ కి అఖిల్ ఇప్పుడు జవాబు చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -