అక్కినేని నాగార్జునకు కొత్త చిక్కు వచ్చి పడింది. క్రిస్మస్ వేడుకల్లో ఎక్కడా పాల్గొనాలనేది తేల్చుకోలేకపోతున్నారు. ఇటు కోడలా? పెళ్లామా? అని డైలామాలో పడ్డాడు. క్రిస్మస్ పర్వదినం దగ్గరకు వస్తుండడంతో ఈ టెన్షన్ పెరిగిపోయింది. అటు పోతే ఇటు అలక.. ఇటు పోతే అటు ఏమవుతదోనని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
ఈ ఏడాది క్రిస్మస్ పార్టీ విషయంలో నాగార్జునకు తలనొప్పిగా మారింది. అక్కినేని వారి కొత్త కోడలు, చైతూ భార్య సమంత కూడా ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున ఓ గ్రాండ్ పార్టీని ఇస్తుంది. పైగా పెళ్లయిన తర్వాత మొదటి క్రిస్మస్ కాబట్టి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది. ఈ పార్టీ అక్కినేని కుటుంబసభ్యులందర్నీ ఆహ్వానించింది. అత్త అమల, మామ నాగార్జునను ప్రత్యేకంగా ఆ హ్వానించింది.
దీంతోపాటు నాగ్ భార్య అమల కూడా ప్రతి ఏడాది క్రిస్మస్ సంబరాలు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ప్లాన్ వేసింది. అయితే ఇక్కడ నాగార్జున మాత్రం ఏ వేడుకలకు వెళ్లాలనేది ఆయనకు వచ్చిన చిక్కు. అమల పార్టీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఆమె వెళ్లడం కుదరకపోవచ్చు. అత్తా, కోడళ్ల మధ్య నాగ్ నలిగిపోతున్నాడు. ఆ రెండు పార్టీలలో దేనికి వెళ్లాలో అర్థం కావడం లేదని – కన్ఫ్యూజింగ్ గా ఉందని నాగ్ స్వయంగా పేర్కొన్నాడు. అయితే అమల, సమంత పార్టీలు హైదరాబాద్లోనే ప్లాన్ చేశారంట. ఈ రెండూ పార్టీలకు నాగార్జున వెళ్లేట్టు కనిపిస్తున్నాడు.