అమాల పాల్ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకొని.. కొన్నాళ్లు బానే ఉన్నా తర్వాత విడిపోయారు. విడిపోవడానికి కారణాలు తెలియకపోయినా.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సాన్నిహిత్యమే దీనికి కారణమని పుకారు జోరుగా వినిపిస్తోంది. రీసెంట్ గా సుచీలీక్స్ వ్యవహారంలో కూడా ఈ జంట పేరు బాగా వినిపించింది.
విఐపి సినిమా తర్వాత ‘వాడ చెన్నయ్’ సినిమాలోను అమలాను ధనుష్ హీరోయిన్ గా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. అయితే సడన్ గా ఈ సినిమా నుంచి అమల వాకౌట్ చేసింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు. అమల సడన్ గా ఈ సినిమా నుండీ ఎందుకు తప్పుకుందనేది తెలీదు. డేట్స్ ఇష్యూస్ అంటున్నారు. కానీ ఆమెకి మరీ డేట్స్ ఖాలీలేనన్ని ప్రాజెక్టులు చేతిలో లేవు.
వీరిద్దరి పేర్లతో జరుగుతోన్న రచ్చ దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని, అమల కూడా సానుకూలంగా స్పందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ధనుష్ కార్యకలాపాలపై రజనీకాంత్ ప్రత్యేకదృష్టి పెట్టారని, అతని ప్రాణ స్నేహితుడు అనిరుధ్తో కూడా ధనుష్ దూరంగా వుంటున్నాడని గాసిప్స్ వున్నాయి. మొత్తానికి సుచీ లీక్స్ రేపిన కలకలం తాలూకు ప్రకంపనలు ఇంకా కోలీవుడ్లో కనిపిస్తూనే వున్నాయి.
Related