యాంకర్ అనసూయ రోజు రోజుకు తన స్టార్డమ్ ను పెంచుకుటోంది. యాంకర్ గా బుల్లి తెరకు పరిచయం అయిన ఈ చిన్నది తన సత్తాను చాటుకుంది. దాంతో సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ కూడా తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర వంటి రోల్స్ తో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది.
ఇప్పుడు కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా సినిమాలోకూడా మాస్ డ్యాన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ ఐటెం సాంగ్ లో అనసూయ లుక్కు మారుతోందని ఎంతో మంది అనుకుంటున్నారు. దీనికి సమాధానంగా ఇటివల విడుదల చేసిన ఫొటోలు చూస్తే తెలిసిపోతుంది. కౌశిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.
బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పన్స్ వచ్చింది. ఇక అనసూయ యాక్ట చేసిని మాస్ సాంగ్ మాత్రం మాములుగా లేదు. అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు అంటూ ఉండే ఈ సాంగ్ సినీ ప్రేముకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
చికెన్ తెచ్చినందుకు రూ. 10 వేల జరిమానా !
రొమాన్స్ పండించబోతున్న సత్యదేవ్, తమన్నా
మోనాల్, అఖిల్ ఆన్స్క్రీన్ రొమాన్స్ మొదలైంది !
ఊరమాస్.. రామ్ కొత్త సినిమా మాములుగా ఉండదు… లింగుస్వామితో.. !