‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో అనసూయ మంచి మార్కులే కొట్టేసింది. కొద్ది నిమిషల పాత్ర అయిన తన నటనతో గ్లామర్ తో అద్భుతంగా నటించింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మకి వరస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అనూయను సంప్రదించినట్లు తెలుస్తుంది.
ఐతే అనసూయ ఇంకా దీనికి సైన్ చేయలేదు. ఆమె సైన్ చేసిన వెంటనే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. రామ్ చరణ్కి ఇది పదో సినిమా కావడం విశేషం. తమిళంళో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం రికార్డులు సృష్టించింది. మరో సారీ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు.