Monday, May 13, 2024
- Advertisement -

భారీ రెమ్యూనరేషన్ డిమాండ్!

- Advertisement -

నాగార్జున మూవీ ‘సోగ్గటాడే చిన్ని నాయనా’  అలాగే ‘క్షణం’ చిత్రంలో నటించి మంచి మార్కులే కొట్టేసింది  యాంకర్ అనసూయ. తన గ్లామర్ తో అందరి మతిపోగోడుతుంది. ఈ రెండు సినిమాలు భారీ విజయం సొంతం చేసుకోవడంతో ఈ భామకి ఇప్పుడు అవకాశాలు వరసగా వస్తున్నాయి. దాంతో అనసూయ రెమ్యూనరేషన్ పెచ్చేసిందట.

అయితే తనతో సినిమాలు చేయడానికి వచ్చిన నిర్మాతలకు రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తోందట. ఏకంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేస్తోందట. దీంతో ఆమెతో సినిమాలు చేయడానికి వచ్చిన చాలా మంది నిర్మాతలు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా ఆమెది హీరోయిన్ గా చేసే రేంజి కూడా కాదు. మరో వైపు ఇండస్ట్రీలో చాలా మంది టాలెంట్ ఉన్న కొత్త హీరోయిన్లు రూ. 20 లక్షలకే ఓకే చెబుతున్నారు. దీంతో నిర్మాతలు వారి వైపే మొగ్గు చూపుతున్నారని టాక్.

అనసూయ ఇంత డిమాండ్ చేయడానికి కారణం యాంకర్ గా జనాల్లో తనకు ఉన్నక్రేజ్ మాత్రమే అని అంటున్నారు. అందుకే ఆమె రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. ఒక్కసారి తగ్గితే వ్యాల్యూ తగ్గుతుందని, అవకాశాలు తక్కువైనా ఫర్వాలేదని బీష్మించుకుని కూర్చుందట. అయితే కొన్ని పెద్ద బేనర్లో అనసూయతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే తక్కువ రెమ్యూనరేషన్ తో వస్తున్న నిర్మాతల ఆఫర్లను ఆమె తిరస్కరిస్తుందని టాక్. పివిపి బేనర్లోనే అనసూయ మరో సినిమా చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -