యాంకర్ గా స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న వారు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగులో అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న వారిలో అందాల భామ రష్మీ ఒకరు. అమ్మడి ఇమేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే.. అమ్మడి ఇమేజ్ ఎంతవరకూ వెళ్లిందంటే.. ఒక్కప్పుడు చాన్సులు లేక ఇబ్బంది పడ్డా రష్మీ.. ఇప్పుడు తన దగ్గరకు.. చాన్సులు వెతుకుంటూ వస్తున్నాయి.
{loadmodule mod_custom,GA1}
రష్మీ.. హీరోయిన్ గా బడ్జెట్ సినిమాల్లో చేసినా.. తానో హీరోయిన్ అన్న పొగరు ఎక్కడా ప్రదర్శించకుండా.. తనకింత ఇమేజ్ తెచ్చి పెట్టిన షోలను యథావిధిగా చేసుకుంటూ వెళ్తోంది. పనిలో పనిగా మధ్య మధ్యలో.. వచ్చే ఓపెనింగ్స్ కు వెళ్లి.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంటుంది. తాజాగా అమ్మడు విశాఖలో ఏర్పాటు చేసిన ఒక స్వీట్ షాపు ఓపెనింగ్ కోసం వచ్చారు. ఈ సంధర్భంగా రష్మీని చూసేందుకు జనాలు ఓ రేంజ్లో అక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీలు వంశీ, మాధవ్తో పాటు తదితర నేతలు పాల్గొన్నారు. ఆది సరసన తాను ఓ సినిమాలో నటించానని, ఆ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రష్మి చెప్పారు.
{loadmodule mod_custom,GA2}
ఇప్పటికిప్పుడు కాకున్నా.. త్వరలోనే తాను విశాఖపట్నంలో సెటిల్ అవుతానని.. .. ఆ విషయంలో తానెప్పుడో డిసైడ్ అయిపోనట్లుగా చెప్పేసింది. రష్మీ వైజాగ్లోనే స్థిరడతాను అని ప్రకటించడంతో.. ఆమె వైజాగ్కు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటుందేమోననే గుసగుసలు మొదలు అయ్యాయి. విశాఖకు చెందిన వ్యాపార వేత్త కుమారుడినో.. రాజకీయ వేత్త కుమారుడినో రష్మీ పెళ్లి చేసుకుంటుందని.. టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.
{youtube}FrgB_vm7tN4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related