Monday, May 20, 2024
- Advertisement -

అసలు నిన్ను ఎవడ్రా టీమ్‌లీడ‌ర్‌ని చేసింది.. సుధీర్‌ పై రష్మీ ఫైర్

- Advertisement -
Anchor Rashmi affair sugary Sudheer

బుల్లితెరపై జ‌బ‌ర్ధ‌స్త్ షోకి ఎలాంటి క్రేజ్ ఉందో.. అందులో ఉండే కమెడియన్స్ , యాంకర్స్ కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా సుధీర్,ర‌ష్మీ బాగా పాపులర్ అయ్యారు. ఇదే కాక సుధీర్,ర‌ష్మీ మెంటర్స్ గా డీజోడి లో చేస్తున్నారు. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈ టీవీ లో ప్రతి బుధవారం వచ్చే ఈ డీజోడి ఇప్పటికే చాల సీజన్స్ ని పూర్తీ చేసుకుంది.

ఈ షోకి కూడా బాగా క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు కొనసాగుతున్న డీ జోడి కూడా సెమి ఫైనల్స్ లోకి అడుగుపెట్టేసింది. తాజాగా ఈ సెమి ఫైనల్స్ కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యి సంచలనం సృష్టిస్తోంది. తాజా ప్రోమోలో రష్మీకి సుధీర్ కి మధ్య ఏం జరిగిందో ఏమో.. ర‌ష్మీ మాత్రం సుధీర్ పై ఫైర్ అయ్యి.. అరే అసలు ఎవడ్రా నిన్ను టీమ్ లీడర్ ని చేసిందంటూ సుధీర్ పై ఓ రెంజ్ లో ఎగిరిపడింది.

{loadmodule mod_custom,Side Ad 1}

దీంతో అక్క‌డు యాంక‌ర్ ప్ర‌దీప్ జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నశేఖ‌ర్ మాస్ట‌ర్, స‌దా, ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ర‌ష్మీ, సుధీర్ పై వేసిన సెటైర్‌.. సుధీర్‌ని టీమ్ లీడర్ చేసినవారికి త‌గిలేట్టుగా ఉండ‌డంతో ఎంటైర్ డీ జోడి టీమ్ అవాక్కయ్యారట. అయితే డీ జోడిలో ర‌ష్మీ సుధీర్ స‌ర‌సాలు విర‌సాలు అంద‌రికీ మామూలే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి డ‌బుల్ మీనింగ్ డైలాగులు హ‌ద్దులు దాటినా.. ప్రేక్షకులకు కావాల్సిన వినోదం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ర‌ష్మీ ఒక్కసారిగా సుధీర్ అలా అనడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}i7qoNR-hwcU{/youtube}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -