యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయీన్స్ గా నటిస్తోంది. అలాగే కాజల్ ఐటం సాంగ్ లో కనిపించబోతోంది. ఇక జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒప్పుకొనబోయే నూతన చిత్ర విషయం లో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
సంచలన దర్శకుడు బాల తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడట. ఇటీవలే నటుడు మోహన్ లాల్ ను కలిసిన బాల జనతా గ్యారేజ్ చిత్ర విశేషాలను అలాగే ఎన్టీఆర్ గురించి అడిగి తెలుసుకొని తన దగ్గర ఎన్టీఆర్ కు సరిపడా కథ ఉందని చెప్పడం జరిగిందట. ఇదే విషయంను మోహన్ లాల్ ఎన్టీఆర్ చెవిలో వేసాడు.
దానికి ఎన్టీఆర్ కూడా కూడా సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే బాల ను కలవమనట్లు సమాధానం చెప్పాడని టాక్. కాకపోతే బాల సినిమాల్లో నటించడమంటే ఆషామాషీ కాదు. ఆయన సహజత్వం కోసం నటుల్ని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. తాను అనుకొన్న లుక్లో కనిపించేంతవరకు ఎవ్వరినీ వదిలిపెట్టడు. చూద్దాం ఎన్టీఆర్ కు ఎలాంటి కథ రెడీ చేసాడో..
Related