బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్ రియాల్టీ రియాలిటీ షో బిగ్బాస్–4 షోకు శుభం కార్డు పడింది స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ రన్నరప్గా నిలిచాడు. ఇక మూడో స్థానంలో సోహైల్ నిలిచాడు. అయితే ఇక్కడ విన్నర్ అభిజిత్, రన్నరప్ అఖిల్ కంటే ఎక్కువ లాభపడింది మాత్రం సోహైలే. మూడో స్థానంలో నిలిచినప్పటికీ అటు ఆర్థికంగా.. నేమ్ అండ్ ఫేమ్ పరంగా బాగా లాభపడింది మాత్రం సొహైల్ మాత్రమే. రూ. 25లక్షల తోపాటు మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలో నటించేలా ఒప్పించుకొని లక్కీ చాన్స్ కొట్టేశాడు.
అయితే సొహైల్ రూ. 25 లక్షలు తీసుకుని గేమ్ నుంచి తప్పుకోవడానికి అతని ముందే లీక్ ఇచ్చింది మెహబూబ్ అని ఒక వీడియో వైరల్ అవుతోంది. రీ యూనియన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన మెహబూబ్.. సొహైల్కి మూడు వేళ్లని చూపిస్తూ తన స్థానంలో ఏంటో ముందే లీక్ చేసినట్టుగా వీడియోలో కనిపించింది. అందుకోసమే సొహైల్ రూ. 25 లక్షలు తీసుకున్నాడని.. మెహబూబ్కి రూ. 5 లక్షలు ఇస్తాననడానికి కూడా కారణం అదే అయ్యి ఉంటుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. మెహబూబ్ హింట్ ఇవ్వడం వల్ల సొహైల్ రూ.25 లక్షలు తీసుకున్నాడంటూ దానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో సోహెల్, మెహబూబ్ మోసం చేశారని ప్రచారం జరుగుతోంది.
కాగా, గ్రాండ్ ఫినాలేలో ముందుగా టాప్ -5 నుంచి ఇద్దరు అమ్మాయిలు హారిక, అరియానా ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ హౌస్లో అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ మిగిలారు. వీళ్లకు బిగ్ బాస్ రూ. 20 లక్షలు ఆఫర్ ఇచ్చాడు. దీనికి ఎవరూ ఒప్పుకోకపోవడంతో మరో ఐదు పెంచి రూ. 25 లక్షలు చేశారు. నాగార్జున ప్రకటించిన ఈ ఆఫర్కు సోహెల్ టెంప్ట్ అయి బయటకు వచ్చేశాడు.