అఖండ సూపర్ హిట్ తో డైరెక్టర్ బోయపాటి శ్రీను .. మంచి ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు వర్షం కురిపించింది. 50 రోజుల్లో ఏకం 200 కోట్లు సొంతం చేసుకుంది. ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖండ చిత్రం అఖండ విజయం సాధించడంతో బోయపాటి మంచి జోష్ మీద ఉన్నారు. అఖండ సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మేరకు ప్రకటన కూడా చేశారు.
అయితే బాలయ్య మిగతా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సీక్వెల్కి కాస్త టైం పట్టేలా ఉంది. ఈ క్రమంలో యంగ్ హీరో రామ్తో ఓ సినిమాని చేసేందుకు రెడీ అయ్యాడు బోయపాటి. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరో రామ్ రెమ్యునరేషన్ కంటే బోయపాటి రెమ్యునరేషనే ఎక్కువట.
హీరో రామ్ ఈ సినిమా కోసం తొమ్మిది కోట్లు తీసుకుంటుంటే.. బోయపాటి ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని కూడా ద్వారక క్రియేషన్స్ పతాకం పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్నాడు. అందులో కృతిశెట్టి హీరోయిన్. ఆ చిత్రం పూర్తి కాగానే బోయపాటి మూవీ పట్టాలెక్కనుంది.
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎరికా ఫెర్నాండేజ్