టాలీవుడ్లో రోజులుగా బ్రహ్మానందం హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మానందం హీరోగా తెరకెక్కే ఈ చిత్ర్రంలో బుల్లితెర హాట్ యాంకర్లు అనసూయ- రేష్మీ గౌతమ్ హీరోయిన్లుగా నటిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఫిక్సయినట్టు తెలుస్తోంది. ‘టు ఇడియట్స్’ అనే అనే టైటిల్ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బ్రహ్మానందం ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తుండడంతో.. కథకు తగ్గట్టుగా ‘టు ఇడియట్స్’ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
బ్రహ్మీ డ్యూయల్ రోల్కు అనుగుణంగా ఓ రోల్కు అనసూయ జంటగా నటిస్తుంటే మరో రోల్కు రేష్మీ జంటగా నటించనుందట. మరి మన హాస్య బ్రహ్మతో ఈ హాట్ యాంకర్ల హాట్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఏ రేంజ్లో హీటు పుట్టిస్తుందోన్న అన్న సస్పెన్స్ అప్పుడే టాలీవుడ్లో ఏర్పడింది. బ్రహ్మీతోనే ‘జప్ఫా’ సినిమా నిర్మించి.. ప్లాప్ అందుకున్న రమేశ్ వర్మకు.. ఈ ‘టు ఇడియట్స్’ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి..!
Related