టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ రంభ. అదిరిపోయే డాన్స్ తో, నటన తో ప్రేక్షకుల ఆదరణ పొందిన హీరోయిన్గా మంచి పేరు ఉంది. అయితే అసలు విషయంలోకి వెళ్తే… ఈ హీరోయిన్ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్ను 2010 ఏప్రిల్లో వివాహం చేసుకుంది రంభ. గత కొన్ని నెలలుగా తన భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి సెపరేట్గా ఉంటుంది. ఏవో కొన్ని సమస్యలు రావడంతో కొన్ని నెలలుగా విడి విడిగా ఉంటున్నారు.
రంభ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే రంభ ఇప్పుడు తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని.. అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్టు… ఫ్యామిలీ కోర్టులో వేసిన పిటీషన్ లో పేర్కొంది.
హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తన భర్తతో కలిసి ఉండే హక్కులు కల్పించాలని కోరింది. అయితే కోర్టులో డిసెంబర్ 3న రంభ కేసు విచారణకు రానుంది. బాలీవుడ్ లో మొదలైన డైవర్స్ వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో ఇటువంటి సమస్యలే మొదలయ్యాయి. టాలీవుడ్ అగ్రహీరోలతో అందరితో నటించి రంభ అలరించింది.
Related