Thursday, May 16, 2024
- Advertisement -

గంటాపై బాబు సీరియస్?

- Advertisement -

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై.. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారట. అవకాశం వచ్చినప్పుడల్లా.. చుట్టుపక్కల ఎవరున్నారు? ఎవరు లేరు అని చూసుకోకుండా మరీ.. గంటాపై ఆగ్రహిస్తున్నారట. తాజాగా..

విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. వీడియో కాన్ఫరెన్స్ అని కూడా పట్టించుకోకుండా.. గంటాపై సీఎం సీరియస్ అవడం.. టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

డీలర్ దగ్గరే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని విశాఖలో మొదటిసారి రాష్ట్ర రవాణా శాఖ ప్రారంభించింది. ఓ డీలర్ దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి గంటాను ఇన్వైట్ చేసింది. దీంతో.. కార్యక్రమానికి గంటా కూడా అటెండ్ అయ్యారు. అదే టైమ్ లో.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ కు వచ్చారు. తనకు అభివాదం చేయబోయిన గంటాను చూసి.. అక్కడెందుకు ఉన్నావ్? ఇక్కడికెందుకు రాలేదు? అని సీరియస్ గా ప్రశ్నించారట. ఇంతలో గంటా ఏదో విరవణ ఇచ్చుకోబోయినా.. పట్టించుకోకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అయ్యారట.

సాక్షాత్తూ ఓ మంత్రితో.. పబ్లిక్ గా సీఎం ఇలా వ్యవహరించడం ఏంటని అధికారులు కూడా కాస్త నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో మంత్రి గంటా కూడా.. కాస్త ఇబ్బందిగా అక్కడి నుంచి నిష్క్రమించారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -