Wednesday, May 15, 2024
- Advertisement -

అప్పట్లో ఎన్టీఆర్ కు జరిగింది…ఇప్పుడు చిరంజీవికి జరుగుతోంది

- Advertisement -

 

ఓడలు బళ్లవుతాయి..బళ్లు ఓడలవుతాయి అంటే ఏంటో చిరంజీవి ఇపుడు స్వయంగా చూస్తున్నాడు.గతంలో ఎన్టీఆర్ చెంతనున్న నిర్మాతలు కొందరు చిరు పక్కకొచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు.అది అప్పట్లో పెద్ద సంచలనం.చిరు హవా చూసి ఎన్టీవోడిని వదిలేసారు  అంటూ అప్పట్లో ఆ  నిర్మాతలపై చాలామంది చాలా  విమర్శలు చేశారు.

సేమ్ టు సేమ్ సీన్ ఇపుడు చిరంజీవి విషయంలో కనిపిస్తుంది.చిరుతో నిన్నటి వరకూ ఉన్న కొందరు నిర్మాతలు మహేష్ ,తారక్ ల చెంతకు చేరడం చిరంజీవికి గతం గుర్తుకొచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.మ్యాటర్లోకి వెళితే…ఆ రోజుల్లో అశ్వనీదత్ ,దేవీ వరప్రసాద్, త్రివిక్రమ రావులు ఎన్టీఆర్ ఎంతగానో నమ్మిన నిర్మాతలు.

వీరంతా చిరు హవా చూసిన తొలినాళ్లలో ఇక ఎన్టీవోడి పని అయిపోయిందనుకుని భావించి… మెగా కాంపౌండ్ లోకి వచ్చి చేరారు.కాస్తో కూస్తో సంపాదించుకున్నారు.పోగొట్టుకోవల్సిన వారు పోగొట్టుకున్నారు.ఇపుడు మహేష్  మేనియా వచ్చింది.

ప్రిన్స్ తన సత్తాతో శ్రీమంతుడిగా వంద కోట్ల క్లబ్ లో చేరడం చూసిన ఇదే చిరును నమ్మిన నిర్మాతలైన ఎస్వీ. ప్రసాద్ ,ఠాగూర్ మధులు ఇపుడు ప్రిన్స్ పంచన చేరారు.ఈ దెబ్బకు అప్పట్లో ఎన్టీవోడు పడ్డ మనో వేదన ఇపుడు చిరంజీవికి కలుగుతుందని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -