ఎప్పుడు చాలా ప్రశాంతగా ఉండే దర్శక ధీరుడు రాజమౌళికి కొపం వచ్చింది.అది కూడా దిగ్గజ నిర్మాత వ్యాపారవేత్త అయిన రామోజీరావు లాంటి వ్యక్తిపై ఆయనకు కోపం వచ్చినట్లు తెలుస్తుంది.బాహుబలి సమయంలో రాజమౌళికి చాల సహయం చేశాడు రామోజీరావు.బాహుబలి సినిమా విషయంలో రామోజీరావు ఈనాడు పేపర్ మొత్తం దానికి సంబంధించిన వార్తలనే ప్రచురించాడు.
సినిమా షూటింగ్ కూడా రామోజీఫిలిం సిటీలోనే జరిగింది. షూటింగ్కు ఎటువంటి అంతరాయం రాకుండా చూసుకున్నాడు రామోజీరావు. మరి అలాంటి వ్యక్తిపై అసహనంతో ఉన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమా సెట్ వర్క్, ఫిలిం సిటీ ఖర్చులు మొత్తం బిల్లు దాదాపు రూ.90 కోట్లు అని బిల్లు చూపించే సరికి రాజమౌళికి కోపం వచ్చినట్లు సమాచారం. చూపించిన లెక్కలలో తేడాలు ఉండడంతో సహించలేక తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ టైంలో శాటిలైట్ హక్కులు ఈటీవీకే ఇస్తానని చెప్పిన రాజమౌళి చివరి వేరే చానెల్కి ఇవ్వడంతో ఇలా ప్రతికారం తీర్చుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇకపై రాజమౌళి తన సినిమాల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.