Sunday, May 19, 2024
- Advertisement -

మంచు లక్ష్మి వల్ల మోహన్ బాబుకి వార్నింగ్..

- Advertisement -

టాలీవుడ్ ప్రముఖలను డ్రగ్స్ కేసు.. నిద్ర పట్టకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినీ ప్రముఖలకు నోటిసులు వెళ్లడం.. వారిని విచారణ జరపడం.. వారు ఆరోపణలు ఎదురుకోవడం జరుగుతోంది. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ లో తెలంగాణ మంత్రి కెటీఆర్ స్నేహితులు ఉన్నారని.. ఇటివలే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విట్ తో.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య గొడవ స్టార్ట్ అయింది.

అయితే దిగ్విజయ్ సింగ్‌ చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ఘాటుగా జవాబు ఇచ్చారు. దిగ్విజయ్ సింగ్ విచక్షణ కోల్పోయారని.. ఆయనకు విశ్రాతి చాలా అవసరం అని కేటీఆర్ రీట్విట్ చేశారు. దాంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం మొదలు అయింది. అయితే ఇది ఇలా ఉంటే ఈ వివాదం మధ్యలోకి మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చింది. కేటీఆర్ ఇచ్చిన జవాబుకి.. వత్తాసు పలుకుతూ.. దిగ్విజయ్ సింగ్ విచక్షణ కోల్పోయారని.. ఆయనకు విశ్రాతి అవసరం అని.. ఎద్దేవా చేశారు. దాంతో ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఇక పొంగులేటి సుధాకర్ రెడ్డి ఏకంగా మోహన్‌బాబుకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ సింగ్ పై మంచి లక్ష్మీ అలా ఎలా కామెంట్స్ చేస్తుందని ప్రశ్నించారట.

మీ అమ్మాయిని రాజకీయాలో వేలు పెట్టొద్దని చెప్పండి అంటూ మోహన్ బాబుకి గట్టిగా చెప్పారట. అయితే మంచు లక్ష్మీ ట్విట్ పై మోహన్ బాబు కూడా పొంగులేటి సుధాకర్ రెడ్డితో ప్రతిస్పందించారట. మా అమ్మాయి అలా చేయకుండా ఉండాల్సిందని అన్నారట. తర్వాత మంచు లక్ష్మీకి మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడట. మరోసారి ఇలాంటివి చేయొద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -