Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 కరోనా కలకలం..ప్రసారం అయ్యేలా లేదే..ఎవరికీ వచ్చిందంటే..!!

- Advertisement -

తెలుగులో బిగ్ బాస్ షో ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ 3 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ ప్రోగ్రాం సీజన్ 4 కి రెడీ అవుతోంది. గత మూడు సీజన్లకు ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్ట్ లుగా చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు సీజన్ 4 కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ సారి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్ లు ఎవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే ఈ సీజన్ కంటెస్టెంట్ లు వీరే అని ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇక దాని పై వచ్చే ట్రోల్స్ అన్ని ఇన్నీ కావు. ఇప్పటికే హీరో నందు తాను కూడా బిగ్ బాస్ లో పాల్గొంటున్నాను అని ఓ హింట్ ఇచ్చేసాడు. ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ షోను నాగార్జున పుట్టిన రోజున అంటే ఆగష్టు 29 లేదా 30 న ప్రారంభం చేయబోతున్నారని ప్రచారం కూడా జరగతోంది. అయితే ఇప్పుడు మరో వార్త బిగ్ బాస్ నిర్వాహకుల్ని షాక్ కి గురిచేస్తోంది. బిగ్ బాస్ సీజన్ -4 లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌ ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు పలు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్నవారిలో ఓ సింగర్ కి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందట. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆ సింగర్ కి బిగ్ బాస్ నిర్వాహకులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. షో ప్రారంభం అయ్యేనాటికి ఆ కంటెస్టెంట్ కి పరీక్షల్లో నెగిటివ్ వస్తే సరి లేకపోతే ఆ సింగర్ స్థానంలో మరొకరిని తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న బిగ్ బాస్ లో ఇప్పుడు ఇలాంటి పరిమాణాలు చోటుచేసుకోడం అటు ప్రేక్షకులు, ఇటు బిగ్ బాస్ అభిమానుల్ని కలవరపెడుతోంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి గంగవ్వ.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..!

బిగ్ బాస్ 4లో పాల్గొనే పది మంది కంటెస్టెంట్స్ వీరే..!

బిగ్ బాస్ లోకి ఆంటీ, యాంకర్.. ఇక రచ్చ రచ్చే..!

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -