తన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన దేవిశ్రీ ప్రసాద్.. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా తన సత్తా చాడుతున్నాడు. ఈ బ్యాచలర్ సంగీత దర్శకుడు త్వరలో పెళ్లి చేసుకోబుతున్నాడు. ఆ మద్య దేవిశ్రీ, హీరోయిన్ ఛార్మీతో ప్రేమలో మునిగి తేలుతున్నాడు అని, ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ కొన్ని రూమార్స్ వచ్చిన విషయం తెలిసిందే.
కాని ఆ వార్తలు నిజం కాదు అని, తాము ప్రేమలో లేము అంటూ హీరోయిన్ ఛార్మి స్వయంగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దేవిశ్రీ పెళ్లి గురించి పెద్దగా వార్తలు రాలేదు. ఇక తాజాగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి ఒక క్లారిటీ వచ్చింది. అయితే చాలాకాలంగా దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళిని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు.
ఇప్పటికే దేవికి 37 ఏళ్ళు వచ్చేసాయి. ఇక లేట్ చేయకూడదని పెళ్ళి చేసుకోమని దేవి ఫ్యామిలీ పట్టుపట్టిందట. అంతేకాదు దేవి కోసం ఓ అమ్మాయిని కూడా చూసారట. ఆంధ్రాకి చెందిన ఆ అమ్మాయితో దేవి జోడీ బాగుంటుందని నిర్ణయించారట. ఈ మ్యాచ్ దేవికి కూడా నచ్చిందని త్వరలోనే పెళ్ళి కొడుకు కాబోతున్నాడని సమాచారం.
Related