Tuesday, May 14, 2024
- Advertisement -

దీక్షా పంత్ కి ధనరాజ్ వార్నింగ్.. ఎందుకు..?

- Advertisement -

తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే బిగ్ హౌస్‌లో సంపూర్ణేష్ బాబు పెద్ద సీన్ క్రియేట్ చేసి.. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తేజస్వి గాని, హంస నందిని లాంటి వాళ్ళు వస్తారని న్యూస్ వచ్చిన.. ఊహించిన విధంగా బిగ్ బాస్ లోకి దీక్షా పంత్ వచ్చి.. అందరికి షాక్ ఇచ్చింది.

దీక్షా పంత్ కొన్ని సినిమాలో నటించినప్పటికి.. ఆమెకి పెద్దగ పేరు రాలేదు. అవకాశాలు పెద్దగా లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్ లో 55 రోజులు ఉండడానికి రెడీ వచ్చేసింది. అయితే అప్పటి వరకు బిగ్ బాస్ షోలో ఉన్నవారు ఎవరు పెద్దగా క్రేజ్ తీసుకొని రాలేకపోయారు. కానీ దీక్ష పంత్ ఎంట్రీతో బిగ్ బాస్ షోకి కొత్త కళ వచ్చింది. ఎంట్రీలోనే స్విమింగ్ పూల్‌లో షో ఇచ్చి షోకు గ్లామర్ బాగా యాడ్ చేసింది. బంతి పూల జానకి సినిమాలో ధనరాజ్ తో కలిసి దీక్షా పంత్ హీరోయిన్‌గా నటించింది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లోకి భామ రావడంతో కాస్తంత ఊపు వచ్చేసింది. అయితే ఈ భామ గతంలో ధనరాజ్ కి చుక్కలు చూపించిందట. అంతే కాదు.. ఆమె డిమాండ్ మరి ఎక్కువ గా ఉండేదట.

దాంతో ధనరాజ్ ఆ సినిమాలో ఆమెతో చేయడానికి తలనొప్పి వచ్చేదట. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎక్కడ తగ్గేది కాదట. ఓ సారి ధనరాజ్ కోపం వచ్చి ఒక్క మాట అన్నాడట. దాంతో షూటింగ్ చేయను అని మధ్యలోనే వెళ్లిపోయిందట. ఆ తర్వాత మళ్లీ బ్రతిమిలాడి పిలిస్తే వచ్చి షూటింగ్లో పాల్గొనిందట. ఏది ఏమైన ఆ సినిమా అయిపోయే సరికి ధనరాజ్ కి చుక్కలు చూపించిందట. మరి ప్రస్తుతం ధనరాజ్ బిగ్ బాస్ షోలో ఉన్నాడు. దిక్ష కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సో ఈ సారి ధనరాజ్ కి ఏ రెంజ్ లో చుక్కలు చూపిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -