పవర్స్టార్ పవన్కల్యాణ్కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ చిత్రాన్ని అందించిన హరీశ్ శంకర్.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఓ మూవీని తీయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారట. విజయ్తో సినిమా చేయాలని గతంలోనే దిల్రాజు ప్రయత్నించాడు. హరీష్ శంకర్ కూడా విజయ్ తో ఓ సినిమా తీయాలనుకున్నాడు. కానీ వివిధ కారణాలతో వీరి కాంబినేషన్ కుదరలేదు.
ప్రస్తుతం హరీశ్శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్తో లైగర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి చార్మి నిర్మాత. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
Also Read: అగ్ర హీరోలూ ఈ సారైనా వెండితెరపై దర్శనమిస్తారా?
దాదాపు రూ. 200 కోట్లు మార్కెట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మారిపోతాడని కూడా టాక్ వినిపిస్తోంది. మరోవైపు దర్శకుడు హరీశ్శంకర్ .. పవన్ కల్యాణ్తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ పూర్తయ్యాక విజయ్తో మూవీ పట్టాలెక్కే చాన్స్ ఉంది.
Also Read: ఆరు నెలల్లో నాలుగు బ్లాక్ బస్టర్లు సినిమాలు