Sunday, May 19, 2024
- Advertisement -

తన భర్త గురించి షాకింగ్ నిజాలు చెప్పిన సింగర్ కౌసల్య

- Advertisement -

చక్రి సంగీత సారథ్యంలో కౌసల్య రా.. రమ్మని… రారా రమ్మని… ” పాట ఇప్పటికి చాలా మంది పాడుకుంటు ఉంటారు. ఈమెకి ఇప్పుడు పెద్దగా చాన్సు లు లేవు. దానితో ప్రస్తుతం స్టేజి షోలు, టెలివిజన్ కార్యక్రమాలు చేసుకుంటూ నెట్టుకొస్తుంది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వూలో ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్న విషయం గురించి తెలిపింది. తన భర్త ఓ శాడిస్ట్ అనీ, తనను నిత్యం హింసిస్తూ బూతులు తిడుతూ భౌతికంగా హింసించేవాడని తెలిపింది.

అంతేకాకుండా తను మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడనీ, దాంతో వేధింపులు మరింత ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. గతంలో రెండు సార్లు ..తన భర్త వేధిస్తున్నాడంటూ గాయని కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు మూడు విడతలుగా ఇద్దరికీ కౌన్సెలింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలో కౌన్సెలింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయినా లాంటి మార్పు రాకపోవడంతో ఆమె ఫిర్యాదు మేరకు అతడిపై 506, 507 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కౌసల్య సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివారు. గుంటూరు మహిళా కళాశాలలో ఇంగ్లీషు లిటరేచర్, కర్ణాటక సంగీతాల్లో డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం పద్మావతి యూనివర్సిటీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేశారు. చిన్ననాటి స్నేహితుడైన బాలసుబ్రహ్మణ్యాన్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నట్లు తెలుస్తోంది. 1999లో ‘మీ కోసం’ సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -