ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సమస్యలతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇదే కోవలో టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత ప్రతి రోజు లైవ్ లో ప్రేక్షకులు అడిగిన పాటలు పాడుతూ వారిలో మానసిక ప్రశాంతతను,ఉత్సాహాన్ని నింపుతు ప్రజా సేవలో నిమగ్నమైన విషయం తెలిసిందే.
తాజాగా ప్రముఖ తెలుగు నేపథ్యగాయని కౌసల్య ఓపాటను పాడి దాన్ని ఎడిట్ చేసి మరీ ఫేస్ బుక్, ఇన్ స్టా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోపై సోషల్ మీడియా ఫాలోవర్స్ నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఈ వీడియోపై కొందరు కొన్ని నెగెటివ్ కామెంట్లు వర్షం కురిపించారు.
Also read:పవన్ కళ్యాణ్ బర్త్ డేకి బిగ్ బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలుసా?
అందులో ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంటర్టైన్మెంట్ వీడియో షేర్ చేయడం బాగోలేదు.రోజుకు ఎంత మంది చనిపోతోన్నారో తెలుసా. కనీసం వారికి సహాయం చేయలేక పోయినా, ఇలాంటి సమయంలో మన సంతోషాన్ని ఎదుటివారికి చూపించకుండా ఉండాలని అన్నాడు. దానికి కౌసల్య సమాధానం ఇస్తూ, ఇలాంటి కష్టమొచ్చింది కదా అని నాకు తెలిసి మీరు తినడమైతే మానలేదు కదా. అలాగే మా లాంటి వారికి సంగీతమే అన్నం పెడుతుందని నెటిజన్ కామెంట్ కు రిప్లై ఇచ్చింది.
Also read:ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. పెద్ద ప్లానే?