Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ అభిమానులకు శూభవార్త!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు ఇద్దరి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బంపర్ హిట్ కొట్టినవే. పవన్ అభిమానులు కాని ఇటు త్రివిక్రమ్ అభిమానులు కానీ ఈ ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

సో ఇప్పుడూ అభిమానులకు ఓ మంచి శూభవార్త వచ్చింది. త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‍లో ఓ భారీ సినిమా రాబోతుంది. అందుకోసం త్రివిక్రమ్ ఓ అధ్బుతమైన కథ కూడా రెడి చేస్తున్నాడట. ఈ సినిమాలో నటించడానికి పవన్ ఎకంగా 26 కోట్లు రెమునరెషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ ఆ అనే సినిమా ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ అ ఆ సినిమాని రాధ కృష్ణ నిర్మించారు.

సో త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్‍లో రాబోతున్న చిత్రాన్నికి కూడా రాధ కృష్ణ తన బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు అని తెలుస్తుంది. ఈ చిత్రం ఎప్పుడూ మొదలు అవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కూడా హిట్ అయితే పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ఈ చిత్రంపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ కాకముందే త్రివిక్రమ్ సినిమా మొదలు కానుందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -