పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సినిమా “గబ్బర్ సింగ్ “. యాక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ తొమ్మిది సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మూవీనీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. దీనికి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో హైదరాబ్లో ఓ కాలేజ్ సెట్ ను నిర్మిస్తున్నారు.కరోనా పరిస్థితులు మెరుగు పడి లాక్ డౌన్ తొలిగిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సెట్లో అడుగుపెట్టబోతున్నాడు.హరీశ్ శంకర్ ప్రస్తుతం కథ, సంగీతం పనుల్లో బిజీగా ఉన్నారు.ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ రెండు బాణీలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే!
Also read:డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందొ తెలుసా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ గా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే మొదటిసారిగా పిరియాడిక్ జోనర్లో “హరిహర వీరమల్లు” సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోందని తెలుస్తుంది.
Also read:కొత్త డైరెక్టర్ తో వైష్ణవ తేజ్ సినిమా.. పాత్ర ఏంటంటే?