Friday, May 3, 2024
- Advertisement -

వైఎస్‌.జ‌గ‌న్‌గా హీరో కార్తీ?

- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జీవిత క‌థ‌ను ‘యాత్ర’ అనే సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.వైఎస్సార్ పాత్రలో మ‌ళ‌యాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి క‌నిపించ‌నున్నారు.ఈ సినిమాకు దర్శకుడిగా మహి.వి.రాఘవ్ వ్యవహరిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌,టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి.రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు ,మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని,వైఎస్సార్ కుమార్తె షర్మిలగా భూమిక నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే జ‌గ‌న్ పాత్ర ఎవ‌రు చేస్తారనే ప్ర‌శ్న అంద‌రిలోను ఉంది.

జ‌గ‌న్ పాత్ర‌ను త‌మిళ హీరో సూర్య చేస్తున్నాడంటు గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన ,అవి నిజం కాద‌ని తెలిపోయ్యాయి.తాజాగా జ‌గ‌న్‌ పాత్ర‌కు మ‌రో హీరో తెర మీద‌కు వ‌చ్చాడు.ఆయ‌నే సూర్య తమ్ముడు కార్తీ.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. మార్కెట్ పరంగా జగన్ పాత్రలో కార్తీని తీసుకునే సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో కార్తీకి మంచి క్రేజ్ ఉంది. దీంతో ఆయ‌న‌ను తీసుకుంటే సినిమాకు ప్ల‌స్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.మ‌రి దీనిపై చిత్రబృందం నుండి అధికార ప్రకటన రావ‌ల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -