Saturday, May 4, 2024
- Advertisement -

స్పీడ్ మీదున్న తారక్.. ఉప్పెన దర్శకుడితో సంప్రదింపులు?

- Advertisement -

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్”చిత్రంలో నటిస్తున్న తారక్ ఈ చిత్రం పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఎలాంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని దక్కించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కొరటాల శివ సినిమా తర్వాత తారక్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మరొక సినిమా కోసం మరొక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమా ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తారక్ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథను విన్న తారక్ కథ నచ్చడంతో ఈ సినిమాకు కమిట్ అయితే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

Also read:పర్యావరణ దినోత్సవంగా మొక్కను నాటిన స్టైలిష్ స్టార్!

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తో కమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను బుచ్చిబాబు ఏవిధంగా చూపించబోతున్నాడు అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజుల పాటు వేచి ఉండాలని తెలుస్తోంది.

Also read:వారి వల్ల నాకు అవకాశాలు తగ్గలేదు: నటి అంజలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -