Tuesday, April 30, 2024
- Advertisement -

స్టార్ హీరో సరసన కీర్తి సురేష్?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో నేనూ శైలజా, నేను లోకల్ తర్వాత మహానటి చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు దోచింది కీర్తి సురేష్. గ్లామర్ కి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కీర్తి సురేశ్ కి మొదటి నుంచీ హోమ్లీ హీరోయిన్ అనే ముద్రపడింది. ఈ మద్య కీర్తి సురేష్ రూట్ మార్చుకుంటుంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఈ చిన్నది ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే మహేశ్ బాబు సరసన ‘సర్కారువారి పాట’ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించనుంది.

తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు లో డైరెక్ట్ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం చిత్ర బృందం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక ఖరారైతే కథానాయికగా కీర్తి సురేశ్ స్థాయి మరో మెట్టు ఎక్కుతుందని చెప్పచ్చు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ నటించిన ‘సర్కార్’ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

నిఖిల్ ‘18 పేజీస్’ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

ఆర్ఆర్ఆర్ చూస్తే ఆడియన్స్ కన్నీళ్లు పెట్టింటారు..?

ఇది సమయం కాదు.. జూడాల సమ్మేపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -